telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఇది అసమర్థ ప్రభుత్వం : నిమ్మల రామానాయుడు

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈరోజు కోవిడ్ భాదితుల ఆక్సిజన్ సరఫరాను పరిశీలించి, భీమవరం ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా కొరతను కూడా అధిగమించేలా చూడాలని కలెక్టర్ ను కోరారు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఆక్సిజన్ కొరతతో ఆసుపత్రుల వద్ద కరోనా బాధిత బంధువులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ను  కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోలేని అసమర్థ ప్రభుత్వం. ఆక్సిజన్ ను  వంతుల వారీగా పేషెంట్లకు పంచుతుండటంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న కోవిడ్ బాధితులను ప్రభుత్వ హత్యలుగా  కేసులు  నమోదు చేయాలి అని అన్నారు. అంబులెన్స్ లో సైతం ఆక్సిజన్ సిలెండర్స్ సరఫరా చెయ్యలేకపోవడంతో అంబులెన్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అని తెలిపారు. అయితే చూడాలి మరి దీని పై వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు అనేది.

Related posts