తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష ఫీజు గడువును పొడగించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్ష ఫీజు గడువు పొడగిస్తూ ఇంటర్ బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు. 29-10-2019 వరకు చివరి తేదీ కాగా దానిని 04-11-2019 తేదీ వరకు పొడగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంటర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ప్రైవేట్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. నవంబర్ 4వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఫీజులు తీసుకోవాలని, నవంబర్ 5వ తేదీ లోపు ఇంటర్ బోర్డు అకౌంట్లో ఆయా కళాశాలల ప్రిన్సిపళ్లు జమ చేయాలని ఆదేశించారు.