telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

స్మిత్ ఔట్.. సైనికి గాయం

ఈరోజు భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టును భారత యువ బౌలర్లు కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. జట్టు ఓపెనర్లను ఇద్దరిని త్వరగా పెవిలియన్ కు చేర్చిన భారత బౌలర్లు ఇప్పుడు రెండో సెషన్ లో ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ (36) ను ఔట్ చేసారు. అయితే ఈ వికెట్ తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో మొదటి వికెట్ తన ఖాతాలో వేసుకున్న భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్. దాంతో 35 ఓవర్లు ముగిసే సమయానికి 91/3 తో ఆసీస్ నిలిచింది. ఆసీస్ ఆటగాడు లాబుస్చాగ్నే(37)తో తన బ్యాటింగ్ కొనసాగిస్తుండగా మాథ్యూ వేడ్ కొత్తగా బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే భారత్ కు మరో దెబ్బ తగిలింది. నవదీప్ సైని గాయం బారిన పడ్డాడు/ 37 ఓవర్ వేస్తున్న సమయంలో గాయం కావడంతో ఆ ఓవర్ పూర్తి చేయకుండానే బయటికి వెళ్ళిపోయాడు సైని. ఇక ఆ ఓవర్ లో చివరి బంతి వేసి ఓవర్ పూర్తి చేసాడు. అయితే ఇదే ఇవర్లో లాబుస్చాగ్నే క్యాచ్ ను మిస్ చేసాడు భారత్ కెప్టెన్ అజింక్య రహానే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts