యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఒక్క రాత్రిలో జరిగిన కథను హీరోయిన్, సాంగ్స్ లేకుండా.. అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు పొందిన లోకేశ్ కనకరాజ్.. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్లయిమాక్స్లో విలన్ చెప్పే డైలాగ్తోనే ‘ఖైదీ’ రెండో భాగం ఉండొచ్చనే సందేహం ప్రేక్షకులకు కలుగుతుంది. దాన్ని నిజం చేస్తూ.. రెండో పార్ట్కు డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పదేళ్లు యావజ్జీవ శిక్ష అనుభవించి బయటకు వచ్చిన కార్తి.. పోలీసులకు సాయం చేసే సందర్భంలో తన గతాన్ని వివరిస్తాడు. తన భార్య ఎలా చనిపోయిందనే విషయాన్ని చెబుతూ బాధ పడతాడు. తన భార్య గర్భవతి అని కూడా చూడకుండా కొందరు దుర్మార్గులు తన ముందే దారుణానికి పాల్పడుతుంటే, వాళ్లలో ఒకరి చంపి తాను జైలుకు వెళ్లానని చెబుతాడు. ఇక క్లయిమాక్స్ సీన్లో కార్తిని చూసి ‘వాడు సంబంధం లేనివాడు కాదురా.. వాడి పేరు ఢిల్లీ’ అంటూ విలన్ చెప్పే డైలాగ్పై ప్రేక్షకుల్లో సందేహం వస్తుంది. కార్తి భార్య చనిపోవడం వెనుక డ్రగ్స్ ముఠా నాయకుడైన విలన్ పాత్ర ఉంటుందనే డౌట్ వచ్చేలా డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్లే రెండో భాగం కథను లోకేశ్ కనకరాజ్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో కనిపించని హీరోయిన్ రెండో భాగంలో కనిపించే చాన్స్ ఉంది. అయితే హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Thanx for the overwhelming response guys,.. loved every minute in sets and the entire process of making kaithi…will cherish this forever! Thank you once again prabu sir and karthi sir for the opportunity!..To answer all your txts and calls yes“ Dilli will be back”👍 pic.twitter.com/uZ6lWX24x3
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) 26 October 2019
హైదరాబాద్ బిర్యానీ గురించి హాలీవుడ్ హీరో మాటల్లో…