telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి డెడ్ బాడీ మాయం!

హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో మరో ఘటన చోటుచేసుకొంది. ఎంతో మంది కరోనా బాధితులకు సేవలందిస్తున్న గాంధీ ఆసుపత్రి కొన్ని విషయాల్లో వివాదాస్పదంగా మారింది. తాజాగా గాంధీలో కరోనా రోగి శవం మాయం కావడం కలకలం రేపుతోంది.నగరంలోని మెహదీపట్నంకు చెందిన రషీద్ ఖాన్ అనే ఓ వ్యక్తి నిన్న కరోనాతో మృతి చెందాడు. ఈ నెల 9న కరోనాతో అతను గాంధీలో చేరాడు. నిన్న ఉదయం 4 గంటలకు చనిపోయాడు. ఆయన చనిపోయినట్టు బంధువులకు ఆసుపత్రి అధికారులు సమాచారం ఇచ్చారు.

దీంతో డెడ్ బాడీని తీసుకెళ్లడానికి నిన్న సాయంత్రం బంధువులు ఆసుపత్రికి వచ్చారు. అయితే మార్చురీలో ఉండాల్సిన మృతదేహం మాయమైంది. దీంతో బంధువులు షాక్ కు గురయ్యారు. ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆసుపత్రి వర్గాలు ఇంత వరకు వివరణ ఇవ్వలేదు.

Related posts