కోవిడ్-19 పరీక్షల కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలకు రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాపిడ్ కిట్లను ఇప్పటికిప్పుడు వినియోగించవద్దని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ఆదేశాలు జారీ చేసింది. రెండురోజుల పాటు రాపిడ్ టెస్టింగ్ కిట్లను వాడి పరీక్షలు చేయవద్దని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ టెస్టింగ్ కిట్లు తప్పుడు ఫలితాలను ఇస్తున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వీటిని మరోసారి పరిశీలించాలని నిర్ణయించామని తెలిపింది. ఇందుకోసం రెండు రోజుల సమయం పడుతుందని ఐసీఎంఆర్ ప్రకటించింది.
కాగా, ఈ టెస్టింగ్ కిట్స్ ఇస్తున్న ఫలితాలు తప్పుగా వస్తున్నాయని రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. చైనా కిట్లను వాడబోమని, పీపీఆర్ విధానంలోనే పరీక్షలు చేస్తామని పలు రాష్ట్రాలు ఐసీఎంఆర్ కు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆర్ఏటీ కిట్ల ద్వారా వస్తున్న కచ్ఛితత్వం చాలా తక్కువగా ఉందని, కేవలం 5.4 శాతం ఆక్యురసీని మాత్రమే ఇవి చూపిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లు విరుస్తున్నాయి.
రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండమైన సక్సెస్: అంబటి