కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ వివాహం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమలు అవుతున్న కారణంగా పెళ్లి వేదికను బెంగళూరు నుంచి రాంనగరలోని ఫామ్ హౌస్ కు మార్చి, అనుమతులు తీసుకుని ఈ పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సుమారు 60 మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్య
ఈ పెళ్లి నేపథ్యంలో కుమారస్వామి కుటుంబంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.లాక్డౌన్ నేపథ్యంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇలా వ్యవహరించడమేంటని చాలా మంది ప్రశ్నించారు. ఈ వివాహ వేడుకపై కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సానుకూలంగా స్పందించారు. ఆ పెళ్లి గురించి చర్చించాల్సిన అవసరమేమీ లేదన్నారు.
వివాహ వేడుక కోసం అవసరమైన అనుమతులన్నీ ఇచ్చామని తెలిపారు. ఆ వివాహం కూడా చాలా సింపుల్గానే జరిగిందని వివరణ ఇచ్చారు.లాక్డౌన్ నేపథ్యంలో వారి పరిమితుల్లో బాగానే చేశారని అన్నారు. అందుకు తాను వారిని అభినందిస్తున్నాని కూడా యడియూరప్ప చెప్పడం గమనార్హం.