telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా వల్ల జరిగిన నష్టంపై రేపు కేసీఆర్ సమీక్ష…

KCR cm telangana

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఆర్ధికంగా చాలా దెబ్బతీసింది. అయితే కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహిస్తారు. 2020 – 2021 బడ్జెట్ పై మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. శనివారం నాడు జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కేసీఆర్ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. వైటిడిఎ స్పెషల్ ఆఫిసర్, యాదాద్రి జిల్లా కలెక్టర్, ఆర్ అండ్ బి అధికారులు, దేవాలయ ఈవో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. నిర్మాణ పనుల్లో పురోగతిని సమీక్షిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Related posts