విజయవాడలోని స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాదంపై సినీ హీరో రామ్ పోతినేని వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. జగన్ గారూ మీ వెనుక కుట్ర జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కంటే కులం ప్రమాదకరమైనదని వేగంగా విస్తరిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రామ్ ట్వీట్లపై విజయవాడ సీపీ శ్రీనివాస్ స్పందించారు. పోలీసులకు కులం, మతం, రాజకీయ పార్టీలు అనేవి ఉండవని చెప్పారు.
విచారణ ఎలా జరపాలో తమకు తెలుసని అన్నారు. ఎవరో ఏదో అన్నారని, దానిపై తాను స్పందించనని చెప్పారు. స్వర్ణ ప్యాలస్ లో క్వారంటైన్ సెంటర్ కాకుండా, కోవిడ్ కేర్ పేరుతో సెంటర్ ను నిర్వహించారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికేవారని చెప్పారు. తమకు సందేహం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామని తెలిపారు. చికిత్స కోసం కరోనా పేషెంట్ల నుంచి అత్యధిక ఫీజులు వసూలు చేశారని తేలిందని ఆయన తెలిపారు.
వైసీపీ నేతలు కలలు కంటున్నారు: సోమిరెడ్డి