telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

14వ రోజూ కూడా పెరిగిన పెట్రోలు ధర

petrol bunk

కరోనా సంక్షోభం నేపథ్యంలో గడచిన 13 రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. నేడు 14వ రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. ఈ ఉదయం లీటరు పెట్రోలు ధరను 51 పైసలు, డీజిల్ ధరను 61 పైసల మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి.

దీంతో న్యూఢిల్లీలో పెట్రోలు రూ. 78.88, డీజిల్ రూ.77.67కు చేరగా, ముంబయిలో పెట్రోలు రూ. 85.70, డీజిల్ రూ.75.11కు, చెన్నైలో పెట్రోలు ధర రూ. 82.27, డీజిల్ రూ.75.29కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్ లో పెట్రోలు రూ. 81.88, డీజిల్ రూ.75.91కు, అమరావతిలో పెట్రోలు రూ. 82.27, లీటర్ డీజిల్ రూ.76.30కు చేరింది.

Related posts