మహారాష్ట్రలోన్ రాజకీయ అనిచ్ఛితికి ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉదయం మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ తో గవర్నర్ భగత్ సింగ్ కోష్యార్ ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ.. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
మరోవైపు సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవిస్, అజిత్ పవార్ లకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఫడ్నవిస్, అజిత్ పవార్ కు శుభాకాంక్షలు. మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఇద్దరూ కలిసి సుపరిపాలన అందిస్తారనే నమ్మకం నాకుంది’ అని ట్వీట్ చేశారు.