telugu navyamedia
రాజకీయ వార్తలు

రాఫెల్ విమానాల ఖర్చు ఎందుకు పెరిగింది: ప్రశ్నించిన రాహుల్

Rahul gandhi congress

ఫ్రాన్స్ లో కొనుగోలు చేసిన రాఫెల్‌‌ యుద్ధ విమానాల్లో ఐదు నిన్న భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. భారత్‌ కొనుగోలు చేసిన 36 యుద్ధ విమానాల్లో భాగంగా ఐదు హర్యానాలోని అంబాలకు చేరుకున్నాయి. రాఫెల్ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా మరోసారి కేంద్రంపై ప్రశ్నలు సంధించారు

ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు ఎందుకు పెరిగిందని రాహుల్ ప్రశ్నించారు. అలాగే, మన ఎయిర్ ఫోర్స్ 126 విమానాలు అడిగితే, కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారని ఆయన నిలదీశారు. యుద్ధ విమానాల రూ.30,000 కోట్ల కాంట్రాక్టును దేశీయ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు కాకుండా, దివాలా తీసిన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

Related posts