telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎంతమంది అవినీతిపరులను పట్టుకున్నారు: వైసీపీపై కన్నా ఫైర్

Kanna laxminarayana

బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది అవినీతిపరులను పట్టుకున్నారని ప్రశ్నించారు. మైనింగ్ అక్రమ రవాణాలో కేవలం వ్యక్తులు మాత్రమే మారారని, వ్యవహారమంతా గతంలో మాదిరే జరుగుతోందని చెప్పారు.

వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమతో ఎన్నో పనులు చేయించుకున్నారని, ఇప్పుడు అధికారంలోకి రాగానే అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పల్నాడులో తలపెట్టిన ధర్నాను వాయిదా మాత్రమే వేశామని, రద్దు చేయలేదని తెలిపారు. పల్నాడు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కన్నా తెలిపారు.

Related posts