telugu navyamedia
రాజకీయ వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లుపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు

rahul gandhi to ap on 31st

తీవ్ర వాదోపవాదాల మధ్య వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం అర్ధరాత్రి లోక్ సభ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు 2019 ని సమర్ధించడం అంటే మన దేశ పునాదులను ధ్వంసం చేయడమే అని పేర్కొన్నారు. ఈ బిల్లును సమర్ధించడం అంటే మన దేశ రాజ్యాంగంపై దాడి చేసినట్లుగానే భావించాలని మంగళవారం తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిని సమర్ధించిన వారు ఎవరైనా దేశ పునాదులను ధ్వంసం చేసినవారు అవుతారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Related posts