తీవ్ర వాదోపవాదాల మధ్య వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం అర్ధరాత్రి లోక్ సభ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు పడ్డాయి. ఈ బిల్లు పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు 2019 ని సమర్ధించడం అంటే మన దేశ పునాదులను ధ్వంసం చేయడమే అని పేర్కొన్నారు. ఈ బిల్లును సమర్ధించడం అంటే మన దేశ రాజ్యాంగంపై దాడి చేసినట్లుగానే భావించాలని మంగళవారం తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిని సమర్ధించిన వారు ఎవరైనా దేశ పునాదులను ధ్వంసం చేసినవారు అవుతారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాళ్లు పట్టుకునే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు: రాజాసింగ్