telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రుల కాన్వాయ్ ను అడ్డుకున్న కొండగట్టు బాధితులు!

telangana ministers

తెలంగాణ మంత్రులకు శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలోని హిమ్మత్ రావు పేటకు వెళుతుండగా మార్గమధ్యలో వీరి కాన్వాయ్ ను కొండగట్టు బస్సు ప్రమాద బాధిత కుటుంబాలు, రైతులు అడ్డుకున్నారు. రాంసాగర్ చౌరస్తా వద్ద కాన్వాయ్ ను అడ్డుకుని రోడ్డుపై బైఠాయించారు.కొండగట్టు ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని, ఇంటికో ఉద్యోగాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో రైతులు కూడా మంత్రులపై విరుచుకుపడ్డారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో మండలంలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సర్దిచెప్పినా వీరు వినిపించుకోలేదు. దీంతో 15-20 నిమిషాల పాటు మంత్రులు కొండగట్టు బాధితుల మధ్య చిక్కుకుపోయారు. చివరికి పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేయడంతో మంత్రులు అక్కడి నుంచి బయలుదేరారు.

Related posts