ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల తేదీలను పకటించింది. జులై 10వ తేదీన ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జులై 12వ తేదీన 2019-20వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి: కేటీఆర్