టాలీవుడ్ లో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా ఎదిగిన బండ్ల గణేష్ కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట. దాంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. ఇటీవల ఆయనను ఎవరు కలిశారు? ఆయనతో ఎవరు భేటీ అయ్యారు.? అనే కోణంలో అధికారులు తెలుసుకుంటున్నారు.బండ్ల గణేష్ ను క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్, శంషాబాద్ సహా బండ్ల గణేష్ ఉండే షాద్నగర్ వైపు కూడా కరోనా కేసులు బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కు కరోనా సోకిందన్న వార్త సినీ వర్గాల్లో కలవరం సృష్టిస్తుంది.
previous post
next post
“వెంకీమామ”లో రకుల్ పాత్రను కొట్టేసిన రాశిఖన్నా