సందర్భాన్ని బట్టి తాము పార్టీలు మారామని ప్రముఖ సినీనటుడు రాజశేఖర్ అన్నారు. నరసాపురంలో నాగబాబుకు, భీమవరంలో పవన్కు తానేమీ వ్యతిరేకంగా ప్రచారం చేయలేదని వైసీపీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గాజువాకలో ప్రచారం చేశానన్నారు. తాము పార్టీలు మారడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారని అన్నారు.
పార్టీలు మారితే తప్పేంటని ఘాటుగా ప్రశ్నించారు. పదిహేనేళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారన్న ఆశాభావాన్ని రాజశేఖర్ వ్యక్తం చేశారు. ఆయనలో ఆ కసి కనిపిస్తోందన్నారు. ఇక ఇండస్ట్రీలో ఐక్యత ఉంటేనే విజయాలు ఉంటాయన్నారు. ఏదేదో రాసి తమ మధ్య ఐక్యతను చెడగొట్టండని సోషల్ మీడియాను కోరారు. వాళ్లంతా అలా రాస్తే.. చిరంజీవి, నాగబాబులను కలిసినప్పుడు తప్పుచేసినట్టుగా అనిపిస్తుందంటున్నారు. తమ మధ్య శత్రుత్వం లేదని స్పష్టం చేశారు.
రామ్ చరణ్ తో పెళ్లి తరవాత ట్రోల్స్ ఎక్కువయ్యాయి : ఉపాసన