ప్రజా చైతన్య యాత్రలో బాగంగా విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు కాన్వాయికి కొందరు వైసీపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు.దాదాపు రెండు గంటల పాటుగా ఆయన కాన్వాయిలోనే నిరీక్షించారు. వేలాదిగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయ ప్రాంతానికి తరలివచ్చారు. దీంతో ఇరు పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట కొనసాగింది. చంద్రబాబు వాహనంపై వైసీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, చెప్పులు విసిరారు.
మరి కొందరు చెప్పులు చూపెడుతూ రచ్చ చేశారు. కాన్వాయి ముందుకు కదలకపోతుండడంతో వాహనం దిగిన చంద్రబాబు నడుచుకుంటూ ముందుకు కదిలారు. అనంతరం మళ్లీ వాహనంలోకి ఎక్కారు. ఆయన కాన్వాయ్ మెల్లిగా ముందుకు కదులుతోంది. ప్రజా చైతన్య యాత్ర చేపట్టేతీరుతామని టీడీపీ నేతలు అంటున్నారు.