రాష్ట్రంలోని యువతను తీవ్రవాదం నుంచి దూరంగా తీసుకువచ్చేందుకు కేంద్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపు చేయాలని నిర్ణయించింది. వచ్చే మూడు నెలల్లో 50,000 ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు గవర్నర్ సత్యపాల్ మాలిక్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ నియామక ప్రక్రియగా భావిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం మరో కీలక ప్రకటన చేయనుందని గవర్నర్ పేర్కొన్నారు, అదేంటన్నది మాత్రం చెప్పలేదు.
జమ్మూకశ్మీర్ ఉనికి, సంస్కృతికి సంబంధించిన ప్రతి అంశం పరిరక్షిస్తామని తెలిపారు. ఇక, కశ్మీర్ లో మొబైల్ సేవల నిషేధానికి కారణం, సంఘ విద్రోహ శక్తులకు ఇంటర్నెట్ ప్రధాన సాధనం కావడమేనని అన్నారు.
కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టి చేతులు ఎత్తేశారు: భట్టి విక్రమార్క