telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యూనియన్ లీడర్ల అత్యుత్సాహం వల్లే ఆర్టీసీలో సమ్మె: తలసాని

తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పందించారు. కొందరు యూనియన్ లీడర్ల అత్యుత్సాహం వల్లే ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని తలసాని విమర్శించారు. రైల్వేను ప్రైవేటీకరిస్తూ ఆర్టీసీపై బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

గొంతు చించుకుంటున్న విపక్ష నేతలు.. వాళ్లు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదని తలసాని హెచ్చరించారు. తమ మేనిఫెస్టోలో ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పామా అని మరోసారి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు పోస్టులు పెడితే చర్యలు తప్పవని తలసాని హెచ్చరించారు.

Related posts