హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ బలమేంటో తెలిసిపోతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ ఇంచార్జీలు, సీనియర్ నాయకులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్ల బీజేపీ మాటలు వట్టి మాటలేనని తేలిపోతుందని మంత్రి అన్నారు. ఇక్కడ బీజేపీ డిపాజిట్ దక్కించుకోవడం కూడా గొప్పేనని ఆయన అన్నారు.
ప్రజల్లో బలం లేదని తెలిసిన బీజేపీ.. కాంగ్రెస్తో కలిసి పరోక్షంగా పని చేస్తోందని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ నాటకాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు మంత్రి సూచించారు. హుజూర్నగర్లో జరుగుతున్న ప్రచారం తీరును ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల పాటు ఇంటింటి ప్రచారం ఉధృతం చేయాలని మంత్రి అన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే హుజూర్నగర్ అభివృద్ధి చెందుతుందని ప్రజలకు తెలుసన్నారు.