గల్ఫ్లో తెలంగాణ బిడ్డలు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గల్ఫ్కు వెళ్లిన తెలంగాణ బిడ్డలకు సంబంధించి విషయంపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గల్ఫ్ దేశాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలు రాష్ట్రానికి వచ్చేయాలని సీఎం పిలుపునివ్వనున్నారు.
గల్ఫ్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చేసుకోవడానికి బోలెడన్ని పనులున్నాయి. హైదరాబాద్ నగరంలో అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి. పనికి మనుషులు దొరక్క వేరే రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటున్న పరిస్థితి ఉంది. అందేకే పొట్ట కూటికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ వారిని రాష్ట్రానికి రప్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడే నిర్మాణ రంగంలో ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.