భారత ఓపెనర్ రోహిత్ శర్మ జెర్సీ నెం.10 వివాదాన్ని మరోసారి గుర్తు చేశారు. రెండేళ్ల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్.. జెర్సీ నెం.10తో బరిలోకి దిగాడు. దీంతో.. సచిన్ టెండూల్కర్ అభిమానులు అప్పట్లో శార్ధూల్పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.
సచిన్ టెండుల్కర్ ధరించిన జెర్సీ నెం.10ని అతని గౌరవార్థం రిటైర్మెంట్ ఇవ్వాలని బీసీసీఐని అభిమానులు కోరారు. దీంతో స్పందించిన బీసీసీఐ.. జెర్సీ నెం.10కి రిటైర్మెంట్ ప్రకటించి.. ఇకపై ఎవరూ ఆ నెంబరు జెర్సీ ధరించడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేసింది. బుధవారం శార్ధూల్ ఠాకూర్ 28వ పుట్టినరోజు జరుపుకోగా.. అతనికి విషెస్ చెప్పిన రోహిత్ శర్మ జెర్సీ నెం.10 వివాదాన్ని మరోసారి గుర్తుచేశాడు.