telugu navyamedia
తెలంగాణ వార్తలు

జాగ్రత్త మోడీ..ఇది తెలంగాణ పులి బిడ్డ‌..నీ ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డేది లేదు..

జాగ్ర‌త్త‌ న‌రేంద్ర‌మోదీ..ఇది తెలంగాణ పులి బిడ్డ‌..నీ ఉడుత ఊపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి కేసఆర్ హెచ్చ‌రించారు. జనగామలోని యశ్వంత్‌పూర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుప‌డ్డారు..

టీఆర్ ఎస్ పార్టీ యుద్ధం చేసిన పార్టీ..పోరాటం చేసిన‌ పార్టీ.. మేం ఊదితే మీరు ఆడ్రాస్ లేకుండా పోతారు అని హెచ్చ‌రించారు.తాము రైతుబంధు ఇస్తుంటే.. కేంద్రం రైతుల పెట్టుబడి ధరలు పెంచుతోందని మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం క‌రెంటు సంస్క‌ర‌ణ పేరుతో మోట‌ర్ల‌తో మీట‌రు పెట్టాలంటున్నాడ‌ని అన్నారు. న‌రేంద్ర మోదీ న‌న్ను చంపినా క‌రెంట్ మోట‌ర్లు పెట్ట‌ము ఏం చేసుకుంటావో చేసుకో పో అంటూ కేసీఆర్ స‌వాల్ విసిరారు. అవసరమైతే దిల్లీకి వచ్చి పొట్లాడతామని హెచ్చరించారు.

నిధులు ఇవ్వకున్న 8 ఏళ్లతో ఎన్నడూ కేంద్రంతో గొడవ పెట్టుకొలేదని, కేంద్రం కొన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. మోదీ రైతుల వెంట, పేదల వెంటపడ్డారని, చంద్రబాబు కూడా మీటర్లు పెట్టాలని చూశాడని జనగామ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ విమర్శించారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు, మెడికల్‌ కళాశాల ఇవ్వరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇవ్వకున్నా పర్లేదు.. దేశం మిమ్మల్ని తరమడం ఖాయమని పేర్కొన్నారు. జాతీయ హోదా, మెడికల్‌ కళాశాలలు, కోచ్‌ ఫ్యాక్టరీ ఇచ్చేవాళ్లనే తెచ్చుకుంటామని అన్నారు.

కుంభకోణాలు చేసిన వారికి విమాన టిక్కట్లు ఇచ్చి విదేశాలకు పంపారు.దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడటానికి సిద్ధమని పేర్కొన్నారు. జ‌న‌గామ టౌన్‌లో టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్ల‌ను మేం ట‌చ్ చేయం.. బీజేపీ బిడ్డల్లారా మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామ‌ని మ‌రోసారి కేసీఆర్ హెచ్చ‌రించారు.

త్వ‌ర‌లో పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, మెడికల్‌ కాలేజీపై త్వరలోనే జీవో ఇస్తాం’ అని కేసీఆర్ జ‌న‌గామ ప్ర‌జ‌లకు హామీ ఇచ్చారు.

Related posts