telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిరుద్యోగులపై కక్ష ఎందుకు.. జగన్ పై లోకేశ్ విమర్శలు

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను జగన్ అమలుచేయడం లేదని దుయ్యబట్టారు. పాదయాత్రలో కోటి 70 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి యువతను ఉద్ధరించేస్తానన్న మీరు.. ఇప్పుడు వాళ్ల మీద క్రిమినల్ కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం అనంతపురంలో ధర్నా చేసిన 22 మంది నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలి’ అని ట్వీట్ చేశారు.

నిరుద్యోగులపై అంత కక్ష ఎందుకు జగన్ గారు? ఉద్యోగాలు ఇవ్వాలని అడిగితే వాళ్ల మీద కేసులు పెడతారా? సిగ్గుగా లేదా? గ్రామ వాలంటీర్ పేరుతో మీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. సచివాలయ పరీక్షా పత్రాలు లీక్ చేసి 20 లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారు’ అని లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts