పర్యావరణ విధ్వంసాన్ని సహించేది లేదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అటవీ, పర్యావరణ శాఖలపై ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల భద్రత, మొక్కల పెంపకంపై చర్చించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
పరిశ్రమల కాలుష్యాన్ని తొలగించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల కాలుష్య నియంత్రణకు హరిత పన్ను విధిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ బోర్డు, సంబంధిత వ్యవస్థల్లో ప్రక్షాళనకు చర్యలు చేపడతామని చెప్పారు. విశాఖపట్టణం కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెడతామ అన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై నాగబాబు వ్యాఖ్యలు