telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాన ప్రాజెక్ట్ లలో జలకళ..సీఎం జగన్ హర్షం

jagan

రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్ట్ లలో నీటి నిల్వలు పెరిగిపోవడంతో ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి మరికాస్త దూరంలోనే ఉన్నాయని ట్వీట్ చేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరుగులు పెడుతోందని పేర్కొన్నారు.

రైతుల ముఖాల్లో ఆనందం నింపేలా ప్రకృతి కూడా రైతులకు సహకరిస్తుండడం శుభసూచకం అని తెలిపారు. ఇటీవలే, శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాముల నుంచి నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడడంతో శ్రీశైలం ప్రాజక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Related posts