“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా విడుదలైన “సాహో” ట్రైలర్ సినిమా పై అంచనాలని భారీగా పెంచేసింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, ప్రభాస్, శ్రద్ధా కపూర్ల రొమాన్స్తో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ని షేక్ చేయబోతున్నట్టు తాజాగా విడుదలైన ట్రైలర్ని చూస్తే అర్థమవుతోంది. టేకింగ్, ప్రభాస్ నటన, యాక్షన్ పార్ట్, హై టెక్నికల్ వేల్యూస్ అద్భుతంగా ఉన్నాయంటూ అందరూ ట్రైలర్ని ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్లో ఉన్న ఈ ట్రైలర్పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించింది. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ గురించి రకరకాల కథనాలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా బడ్జెట్పై ప్రభాస్ స్పందించాడు. “ఈ సినిమాను మేం భారీగా తీశాం. సినిమా బడ్జెట్ అక్షరాల 350 కోట్ల రూపాయలు. నేను గాల్లోకి ఎగరడాన్ని ట్రైలర్లో చూసే ఉంటారు. ఆ సీన్లను భారీగా తీశాం.అలాగే ట్రైలర్లో పింక్ సరస్సు కనిపిస్తోంది. అది ఆస్ట్రేలియాలో ఉంది. ఇంకా చాలా విశేషాలున్నాయి. ప్రపంచంలోని ఉత్తమమైన వాటిని ఒకచోట చేర్చి ఈ సినిమాలో చూపిస్తున్నాం” అని ప్రభాస్ వెల్లడించాడు.
హైదరాబాద్ కు మకాం మారుస్తున్న రేణూదేశాయ్