telugu navyamedia
సినిమా వార్తలు

‘పుష్ప’మూడో సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది..

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ మూవీలో పుష్ప‌రాజ్ గా అల్లు అర్జున్‌, రష్మిక మందన్నాశీవ‌ల్లిగా న‌టిస్తున్నారు . రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీ ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదలకు కాబోతోంది.

Allu Arjun's Pushpa To Surprise On Diwali?

ఇక ఇప్పటికే పుష్ప నుంచి విడుదల ఫస్ట్‌ సింగిల్‌, సెకండ్‌ సింగ్‌ల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌ విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి మరో థర్డ్‌ సింగిల్‌ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌.‘నువ్వు అమ్మి అమ్మి అంటుంటే… నీ పెళ్లాన్నే అయిపోయినట్టుంది రా సామీ’ అంటూ సాగే ఈ మూడో పాట ప్రోమోను విడుదల చేస్తూ అక్టోబర్‌ 28న ఫుల్‌ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ఈ పాటను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రచింపగా.. మౌనిక యాదవ్ ఆలపించారు.

Pushpa's Second Single 'Srivalli' Featuring Allu Arjun And Rashmika Mandanna Is Soulful And Bewitching! - Filmibeat

ఈ ప్రోమో సాంగ్‌ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలో విడుదల చేశారు. కాగా ఇప్పటికే విడదులైన ఫస్ట్‌ సింగిల్‌ దాక్కో దక్కో మేక, శ్రీవల్లిగా రష్మికపై చిత్రీకరించిన ‘చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.. మాటే మాణిక్యమాయేనే’ సాంగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి.

Allu Arjun's Pushpa To Have Another Midas Touch?

Related posts