telugu navyamedia
సినిమా వార్తలు

పవన్‌కల్యాణ్‌గారూ.. భీమ్లానాయక్‌తో సబ్ కా బాప్ అని నిరూపించండి..!

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..ఎప్పుడూ వార్తలో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా చేసిన ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

వర్మ ఏమన్నారంటే:
సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దని ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు ఫలితం చూశారు…అప్పుడు ఇప్పుడు మళ్లీ చెప్తున్నా.. భీమ్లా నాయక్ ను ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి.. పవన్ కల్యాణ్ మీ పాన్ ఇండియా పవర్ ఏంటో చూపించండి అంటూ ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్ కు సూచనలతో చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాలాగా రిలీజ్ చేయాలని సూచించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న – భీమ్లా నాయక్ – మూవీకి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. అందులో పవన్ పక్కన నిత్య మీనన్, రానాకి జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. పవన్ కళ్యాన్ ను స్ర్కీన్ పై ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే పెద్ద సినిమాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే.

“బీమ్లా నాయక్”తో మీరే సబ్ కా బాప్ అని నిరూపించాలని, పుష్పయే అంత చేస్తే, పవర్ స్టార్ అయిన మీరు భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలన్నారు. పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన… మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేమన్నారు. ‌ వైఫల్యం భయం వైఫల్యాన్ని నిర్ధారిస్తుందని తనదైన శైలిలో ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Related posts