న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24 న విడుదలై ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది.
బెంగాల్ బ్యాక్డ్రాప్లో వచ్చే శ్యామ్సింగరాయ్ కథ సినిమాకు హైలైట్గా నిలిచింది . ఇందులో నాని.. శ్యామ్ సింగరాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు.
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రలలో నటించారు . నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి భారీ బడ్జెట్తో నిర్మించారు.
కరోనా కారణంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు శుభవార్త తెలిపింది ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్. ఈ సినిమా త్వరలోనే ఓటిటీలో ప్రేక్షకులను అలరించేందుకు శ్యామ్ సింగరాయ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా జనవరి 21 న విడుదల కానుంది.ఈ మేరకు శ్యామ్ సింగరాయ్ పోస్టర్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
టీడీపీకి అసలైన వారసుడు ఎన్టీఆర్ : ఆర్జీవీ