టాలీవుడ్ స్టార్ ఫ్యామీలీల్లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి పరిశ్రమలో ప్రస్తుతం ముగ్గురు హీరోలు ఉన్నారు. వీరు ముగ్గురు కూడా తమతమ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురి సినిమాల్లో ఒక్కటి కూడా ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదల కాలేదు. వీరి మూడు సినిమాలపై కూడా అభిమానుల్లో భారీ రేంజ్ అంచనాలే ఉన్నాయి. నాగార్జునా నటిస్తున్నా వైల్డ్ డాగ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్దంగా ఉంది. నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయాన్గా చేసిన లవ్ స్టోరీ కూడా రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉంది. ఇక మూడో వాడు అఖిల్, బుట్ట బొమ్మ పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా ఇంకా విడుదాల కాలేదు. దాంతో ఈ ముగ్గురు తమ సినిమాలను సమ్మర్కు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అసలు నిజానికి ఈ మూడు సినిమాలు గతేడాది సమ్మర్కు రవాల్సి ఉంది. కానీ కరోనా పుణ్యమా అని ఈ ఏడాది వరకు వాయిదా పడ్డాయి. అయితే నేడు తాజాగా అక్కినేని నాగార్జునా నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఈ నెల 26న నెట్ఫ్టిక్స్లో విడుదల చేయనున్నాట్లు వైల్డ్ డాగ్ టీం నిర్ణయించింది. మరి హిట్ కోసం పరితపిస్తున్న నాగ్కు ఈ సినిమా హిట్ అందిస్తుందో..లేదో వేచి చూడాలి.
వై .సి .పి నాయకులను మూసుకొని కూర్చోమని చెప్పలేరా ?