telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్‌డౌన్ తర్వాత రెండో పెళ్లి చేసుకునేపనిలో హీరోయిన్

sweta

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన కొత్త బంగారులోకం సినిమాలో ముద్దుగా ఎక్కడ అంటూ పరిచయం అయింది శ్వేత బసు. దానికి ముందే హిందీలో కొన్ని సినిమాలు కూడా చేసింది. నేషనల్ అవార్డు కూడా అందుకుంది. అయితే తెలుగులో కొత్త బంగారు లోకం తర్వాత కెరీర్‌ను సరిగ్గా మలచుకోలేదు. పైగా సెక్స్ రాకెట్‌లో దొరకడం కూడా శ్వేత కెరీర్‌కు మచ్చలా మారిపోయింది. దాంతో పూర్తిగా ఈమెను మరిచిపోయారు మన ప్రేక్షకులు. శ్వేతా బసు ప్రసాద్ హిందీ సీరియల్స్ చేసుకుంటూ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఏడాది కాపురం తర్వాత విడాకులు కూడా తీసుకుంది. 2018లో పెళ్లిచేసుకుని ఆ తరువాత 2019లో విడాకులు తీసుకుంది ఈ భామ. దాంతో భర్త నుంచి విడిపోయిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది శ్వేత బసు. దాంతో ఓ మానసిక వైద్యుడు దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పింది ఈమె. శ్వేతాను చూసి భయపడుతున్న తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోవాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ల మాట కాదనలేక లాక్‌డౌన్ తర్వాత రహస్యంగా మరో వివాహం చేసుకోవాలని శ్వేతా బసు ప్రసాద్ ఆలోచిస్తుందని ప్రచారం జరుగుతుంది.

Related posts