దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జూలై 30,2020న విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా నటిస్తున్న అలియా భట్కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ నిన్నటితో పూర్తైట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్కి జోడీగా ఎంపిక చేసిన ఓలివియా మోరిస్పై సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఆ తర్వాత క్లైమాక్స్ చిత్రీకరించి శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ప్రస్తుతం షూటింగ్తో పాటు గ్రాఫిక్ వర్క్ కూడా సమాంతరంగా నడుస్తుంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చరిత్రలో ఇంత వరకు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాల్పనిక కథాంశానికి దేశభక్తి జోడించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో బాలీవుడ్ నటుడు అగ్రనటుడు అజయ్ దేవ్గణ్ నటిస్తున్నాడు. న్యూ ఇయర్కి చిత్రానికి సంబంధించి ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.