జాంబీరెడ్డీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన సినిమా. ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ అంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో ఈ సినిమా కొత్త ప్రయోగంగా రూపొందుతోంది. అయితే కొత్తగా ఈ సినిమా బిగ్ బైట్ అంటూ సరికొత్త అప్డేట్ ఇవ్వనుంది. ఈ అప్డేట్ను విడుదల చేసేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ బిగ్బైట్ను నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే ఇవాళ రెబల్ స్టార్ ప్రభాస్ దీనిని రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో ఆనంది, సజ్జ తేజాలు ప్రధాన పాత్రలుగా చేస్తున్నారు. ఈ సినిమా యాపిల్ ట్రీస్ స్టూడియోస్ బ్యానర్పై రూపొందుతోంది. తెలుగులో జాంబీల కథాంశంతో వస్తున్న మొట్టమొదటి సినిమా ఇది. ఈ సినిమాపై బారీ అంచనాలే ఉన్నాయి. మరి ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి. అయితే.. జాంబీరెడ్డి ట్రైలర్ను రెబల్ స్టార్ రిలీజ్ చేయడం ఈ సినిమాకు మంచి బుస్ట్ అని చెప్పచ్చు.
previous post