” ఈ మధ్యన ఓ సన్నాసి .. అతని పేరేమిటో మర్చిపోయాను . మానాయకుడు చిరంజీవి గారంటే సోదర భావం ఉందని చెప్పాడు . అక్కరకు రాని సోదరభావం దిబ్బలో వెయ్యడానికా ? సినిమా పరిశ్రమ మీద దాదాపు లక్షమంది ఆధారపడ్డారు , అలాగే థియేటర్ ల మీద కొన్ని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి . నా మీద కోపంతో ఇంత మంది పొట్ట కొట్టడం అన్యాయం కదా ?” అంటూ వై .సి .పి మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “రిపబ్లిక్ ” సినిమా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నాడు . ఆయన ఉపన్యాసంలో మొత్తం వై .సి .పి . ప్రభుత్వాన్ని , నాయకులను దుమ్మెత్తి పోశారు . ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా థియేటర్ల సమస్యలపై చర్చించడానికి సమాచారమంత్రి పేర్ని నాని, కమీషనర్ విజయకుమార్ రెడ్డి తో నిర్మాతలు , దర్శకులు విజయవాడ లో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి 60 మంది సినిమా రంగ ప్రముఖులు విజయవాడ వెళ్లారు . నాని , విజయకుమార్ రెడ్డి ఈ ఇద్దరితో నిర్మాతలు , దర్శకులు థియేటర్ లలో టిక్కెట్లు ఆన్ లైన్ విధానంపై చెప్పిన సమస్యలను విని . వీటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెడతామని చెప్పారు . హైదరాబాద్ నుంచి వెళ్లిన వారందరికీ విందు భోజనం పెట్టి పంపించారట .
దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ .. – ” ప్రభుత్వాన్ని చూసి ఎందుకు భయపడాలి. అలా భయపడేవారంటే నాకు చిరాకు. అందరూ పెద్దవాళ్ళే , వైకాపా . నాయకులను మూసుకొని కూర్చోమని ఎందుకు చెప్పలేరు. అలా చెబితే ఏమి చేస్తారు ? ఇది వై .సి .పి రిపబ్లిక్ కాదు , భారత రిపబ్లిక్ అని చెప్పండి ” అని మండిపడ్డారు .
” అధికారంలోకి వచ్చినవారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి . అధికారం వుంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లిబియా అధ్యక్షుడు గడాఫీకి ఏ గతి పట్టిందో తెలుసుకోండి ” అన్నారు .