తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాలో వసుమతి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కియారా అద్వానీ. ప్రస్తుతం కియారా అద్వానీ అక్షయ్ కుమార్ హీరోగా లారెన్స్ దర్శకత్వంలో ‘లక్ష్మీబాంబ్’ అనే ఓ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తోంది. ‘కాంచన’ మూవీకి రీమేక్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ‘ఇందూ కీ జవానీ’ అనే మరో చిత్రం లోనూ ఆమె నటిస్తోంది. ఇక కెరీర్ పీక్స్లో ఉండగా టాప్ లెస్ ఫోటో షూట్ చేసి సంచలనం రేపింది. డబూ రత్నానీ చేసిన ఈ ఫోటో షూట్ ఈ యేడాది టాప్ ట్రెండింగ్లో ఉంది. ఈ ఫోెటో షూట్లో కియారా కేవలం ఒక ఆకు మాత్రమే తన చేతులతో పట్టుకొని అడ్డు పెట్టుకున్న ఫోజుపై సోషల్ మీడియాలో ఈ భామపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేసారు. ఇక ఈమె కనిపడినపుడల్లా మీడియా వాళ్లు టాప్ లెస్ ఫోజు గురించే అడుగుతున్నారు. దానికి కియారా కొత్తగా ఉంటుందని ట్రై చేశా. మీకూ నచ్చిందా .. అయితే నాకు నచ్చింది అంటూ సిగ్గుపడుతుంది. కొంత మంది కొంటే నెటిజన్స్ మాత్రం ఆకునైనా కాకపోతిమి మా జన్మ ధన్యమైపోయేది అంటూ రాగాలు ఆలపిస్తున్నారు.
previous post
next post