telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ లో మరో భామకు కరోనా!

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా మరో స్టార్ హీరోయిన్ భూమి పెడ్నేకర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె పేర్కొంది. ‘బధాయ్ దో, మిస్టర్ లేలే’ చిత్రాలలో నటిస్తున్న భూమి గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటోంది. కరోనా బారిన పడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఫలితం దక్కలేదు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. కరోనా పరీక్ష చేసిన తర్వాత తనకు కొవిడ్ 19 వచ్చినట్టు తెలిసిందని, కరోనా లక్షణాలు కొద్దిగానే ఉన్నా, ఆరోగ్యం బాగానే ఉందని, అందుకే హోమ్ ఐసొలేషన్ పాటిస్తున్నానని తెలిపింది. ఆవిరిపట్టడం, విటమిన్ సి టాబ్లెట్స్ వేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం తప్పనిసరిగా చేయమని ఆమె కోరింది. ఇటీవలి కాలంలో తనకు సన్నిహితంగా మెలిగిన వారు సైతం కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా భూమి రిక్వెస్ట్ చేసింది.

Related posts