telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విగ్రహాల ధ్వంసంపై జగన్‌ సర్కార్‌ అలర్ట్‌

vellampalli srinivas ycp

ఏపీలో దేవాలయాలపై వరసగా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి.  ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. రామతీర్ధం ఘటనతో ఒక్కసారి గా ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సీరియస్ అయ్యాయి. అయితే.. దేవాలయాల్లో జరుగుతోన్న వరుస ఘటనల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దేవదాయ, పోలీసు శాఖల ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు మంత్రి వెలంపల్లి. దేవాలయాల్లో జరుగుతోన్న ఘటనలను నివారించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుపై సమాలోచనలు చేస్తోంది ప్రభుత్వం. పోలీసు శాఖ తో సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లపై చర్చ నిర్వహించనుంది ఏపీ సర్కారు. దేవాలయాల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షంచనున్నారు మంత్రి వెలంపల్లి. ప్రతి దేవాలయం వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే వివిధ దేవాలయాల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది.

Related posts