telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ డాక్టరేట్ ‘మనం సైతం’ కుటుంబానికి అంకితం : కాదంబరి కిరణ్

Kadambari-Kiran

ప్రతిష్టాత్మక గ్లోబల్ హ్యుమన్ పీస్ యూనివర్శిటీ వారి నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు ప్రముఖ నటులు, ‘మనం సైతం’ వ్యవస్థాపకులు కాదంబరి కిరణ్. కొవిడ్ నిబంధనలకు లోబడి.. హైద్రాబాద్ బిర్లా సైన్స్ మ్యూజియం ఆడిటోరియంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం పొందిన సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ ‘ఈ గౌరవం మనం సైతం సభ్యులకు వినమ్రంగా అంకితం చేస్తున్నాను’ అన్నారు. ఆపదలో ఉన్నవారిని, సహాయార్ధం కోసం చూస్తున్న ఆపన్నులను ఆడుకుంటూ పెద్ద ఛారిటీగా ఎదుగుతున్న సంస్థ “మనం సైతం”. మన సైతం ఒక యజ్ఞంలా సాగిపోతోంది. సాయం కోరిన ప్రతి పేదవారిని ఈ సంస్థ ఆదుకుంటోంది. “మనం సైతం” పేరుతో కాదంబరి కిరణ్ ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే. తమ చుట్టూ ఉన్నవారంతా తమ వాళ్ళే అనుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తోంది కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని మనం సైతం సేవా సంస్థ.

Related posts