ప్రముఖ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పెళ్ళి చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అక్కినేని నాగార్జునతో నటించిన భాయ్ చిత్రం ఈ అమ్మడి చివరి చిత్రం కాగా, ఆ తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లింది. 2013 నుండి సినిమాలకి దూరంగా ఉంటున్న ఈ అమ్మడు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎం.బి.ఏ) ని సెయింట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటి నుండి పూర్తి చేసింది. అయితే ఈ ఏడాది మొదట్లో రిచా.. జోయ్ అనే వ్యక్తితో నిశ్చితార్ధం అయినట్టు ప్రకటించింది. జోయ్ తో నాకు నిశ్చితార్థం అయింది. బిజినెస్ స్కూల్ లో జోయ్ ను కలిశాను. రెండు అద్బుతమైన సంవత్సరాలు బిజినెస్ స్కూల్ లో గడిసాయి. నా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేసింది రిచా గంగోపాధ్యాయ్. తాజాగా వీరిద్దరి వివాహం క్రిస్టియన్, హిందూ పద్దతిలో జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం రిచా, జోయ్ల వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లీడర్, మిరపకాయ్, నాగవల్లి, మిర్చి, భాయ్ వంటి చిత్రాలలో కథానాయికగా నటించి అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం విశేషం.
previous post
next post