telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో నటికి కరోనా పాజిటివ్

Swetha-Tiwari

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గలేదు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగించే విషయం. సినిమా ఇండస్ట్రీలోని సెలెబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా హిందీ సీరియల్ నటి శ్వేతా తివారీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని శ్వేత స్వయంగా వెల్లడించింది. తనకు ఈ నెల 16 నుండి కరోనా లక్షణాలు ఉన్నాయని టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించింది. దాంతో వచ్చేనెల 1వ తేదీ వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉంటానని ప్రకటించింది. ప్రస్తుతం తనకు టఫ్ టైం నడుస్తుందని పేర్కొంది. అంతేకాదు తనను కాంటాక్ట్ అయినవారు కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించింది. శ్వేతా తివారి “మేరే డాడ్ కీ దుల్హన్” అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఇక దేశంలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 56 లక్షలు దాటిపోయింది.

Related posts