పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘పింక్’ షూటింగ్ కూడా దాదాపు అయ్యిందని టాక్. ఇప్పుడు క్రిష్ డైరెక్షన్లో ‘విరూపాక్షి’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు పవన్. వీటి కోసం పవన్ పక్కాగా షెడ్యూల్ కూడా ప్లాన్ చేశారు. కాగా పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ సమ్మర్లో రిలీజ్ కానున్నట్లు నిర్మాత దిల్ రాజు ముందుగానే ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో వకీల్ సాబ్ సినిమా సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే క్రిష్, పవన్ విరూపాక్షి కూడా మరింత లేట్ అయ్యేలా ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఒకవేళ అనుకున్న సమయానికి సినిమా పూర్తైనా.. అప్పటికి వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి.. ఈ సినిమా వెనక్కి తగ్గక తప్పదు. కాబట్టి ఈ రెండు సినిమాలు అనుకున్న సమయానికి పూర్తయితే, హరీష్ శంకర్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారు పవన్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను కూడా ఫినిష్ చేసే పనిలో పడ్డారని టాక్. అందులోనూ చాలా గ్యాప్ రావడంతో.. మే నెలలో పవర్ స్టార్ సినిమా రీలీజ్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలేటట్టు కనిపిస్తోంది.