గ్రేటర్ పరిధిలో ఒకే రోజు 25 నూతన బస్తీదవాఖానాలు ప్రారంభమయ్యాయని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం హబ్సీగూడలోని రాంరెడ్డినగర్లో ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీదవాఖానాల ఏర్పాటుతో పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
జంటనగరాల్లోని బస్తీదవాఖానాల్లో వైద్యసేవలతో పాటు మందులు కూడా ఉచితంగా పంపిణి చేస్తున్నారని తెలిపారు. హబ్సీగూడలోని బస్తీదవాఖానా వల్ల 3వేల కుటుంబాలకు, సుమారు 12వేల మంది ప్రజలకు వైద్యసేవలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసి కమిషనర్లోకేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.