సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన కల్పిత చిత్రం “మర్డర్”. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ అమృతా ప్రణయ్ కోర్టుకెక్కారు. ఈ సినిమాలో తన పేరు, ఫొటోలు వాడుకున్నారంటూ గత నెల 29న ఆ సినిమా దర్శక, నిర్మాతలపై సూట్ ఫైల్ చేశారు. ఇప్పటికే భర్త ప్రణయ్ హత్యతో రెండేళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, కల్పిత స్టోరీలతో సినిమా చిత్రీకరించి తమ జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. దీంతో ఈ సినిమాను తక్షణమే నిలిపివేసేలా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేయాలని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో అమృత వేసిన పిటిషన్పై విచారణ పూర్తి అయింది. తన జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నారని అమృత పిటిషన్లో పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను పరిశీలించిన ధర్మాసనం తీర్పును ఈ నెల 24కు వాయిదా వేసింది.
previous post