బి. మధు సమర్పణలో మూవీ డైనమిక్స్, ఆరా సినిమా ప్రై.లి. పతాకాలపై టి.సంతోష్ దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం “అర్జున్ సురవరం”. ఈ మధ్యే విడుదలైన టైటిల్ పోస్టర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ టీజర్ లో “అబద్దాన్ని నిజం చేయడం చాలా సులభం..కానీ నిజాన్ని నిజంగా నిరూపించడం చాలా కష్టం…” అంటూ నిఖిల్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆసక్తికరంగా కొనసాగిన ఈ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పటికే 2.5 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసేసింది ఈ టీజర్.
ఇక ఈ టీజర్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి మెసేజ్ పెట్టడం విశేషం. ఈ విషయాన్ని గురించి నిఖిల్ ప్రస్తావిస్తూ “ఈ సినిమా టీజర్ ను విడుదల చేసిన తరువాత, పలువురు ప్రముఖుల నుంచి నిర్మాత రాజ్ కుమార్ గారికి మెసేజ్ లు వస్తున్నాయి. ఒక మెసేజ్ ను మాత్రం ఆయన అదే పనిగా చూస్తూ మురిసిపోతున్నాడు. ఆ మెసేజ్ ను ఎవరు పంపించి వుంటారా అని ఆయన నుంచి ఫోన్ లాక్కుని చూశాను. అది మెగాస్టార్ పంపించిన మెసేజ్… ఆ మెసేజ్ లో “ఇప్పుడే ‘అర్జున్ సురవరం’ టీజర్ చూశాను… చాలా ఆసక్తికరంగా వుంది. దర్శక నిర్మాతలకు, నిఖిల్ కు ఆల్ ది బెస్ట్” అంటూ ఉండడం చూసి షాక్ అయ్యాను. నిజంగా ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు” అని ఉంది. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు నిఖిల్.
My prod Rajkumar was so happy reading some mssgs on his phn. I pulled his phn 2 check wht it is ..nd OMG its the msg from our beloved Mega Star himself on #ArjunSuravaram teaser.
The biggest high of our life.🤸♂🤸♂ #BOSS 🙏
p.s- took the legends permission b4 sharing this 🤗 pic.twitter.com/ZvEDpaAgTa— Nikhil Siddhartha (@actor_Nikhil) March 4, 2019