telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అన్ని ఉద్యోగాలకు ఒకే పరీక్ష.. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర

NR Agency

అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒకే పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ రిక్రూట్ మెంట్ ఏజెన్సీ (ఎన్ఆర్ఏ)ని ఏర్పాటు చేయాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

కేబినెట్ సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ  పరీక్షల విధానాన్ని వివరించారు.  రిక్రూట్ మెంట్ ఏజెన్సీ ఏర్పాటుతో వివిధ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగార్థులు ఇకపై సీఈటీ పరీక్షను ఆన్ లైన్లో రాస్తే సరిపోతుందన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చుల భారం తగ్గుతుందని తెలిపారు.

నాన్ గెజిటెడ్ పోస్టుల కోసం వేర్వేరు పరీక్షలు అవసరం లేకుండా ఆల్ లైన్ సీఈటీకి హాజరైతే సరిపోతుంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులు మూడేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటాయి. తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశం అభ్యర్థులకు ఉంటుంది. మరో రెండు అదనపు అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.

Related posts