telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఉప్పెన పై మహేష్ స్పందన…

Mahesh

ఉప్పెన సినిమాతో హీరో, హీరోయిన్‌లు తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు. తమ తొలి సినిమాతో ఈ జంట అందరినీ మెప్పించింది. ఈ అద్భుత చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎంతో అరుదైన సినిమాను వెండి తెరకు పరిచయం చేశారని మహేస్ అన్నారు. ‘ఉప్పెన సినిమాను ఒక్క పదంలో చెప్పాలంటే క్లాసిక్. ఇండస్ట్రీకి బుచ్చిబాబు ఎంతో అరుదైన సినిమాను తీసుకొచ్చారు. ఈ విషయం చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాకు సంగీతం కూడా చాలా కీలకం. ఈ సినిమా సంగీతం సినిమా కథతో పోటీ పడే విధంగా ఉంది. ఈ సినిమాతో దేవీ శ్రీ ప్రసాద్ మరో సారి తన ప్రతిభను చూపించారు. ఇక నటీనటుల విషయానికొస్తే వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి వారి నటన గురించి ఎంత చెప్పినా తక్కవే అవుతుంది. తమ తొలి సినిమాలోనే ఎంతో గొప్పగా నటించారు. ఇటువంటి సినిమాను నిర్మించినందుకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు. మహేష్ ట్వీట్‌కు సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ దన్యవాదాలు తెలిపారు.

Related posts