telugu navyamedia
రాజకీయ వార్తలు

మన్మోహన్అధ్యక్షుడుగా కాంగ్రెస్ కొత్త కమిటీ!

Congress manmohan

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన ఓ కమిటీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారు. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి పార్టీ తరఫున తీసుకోవాల్సిన నిర్ణయాలను సూచిస్తుందని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

ఈ బృందం ప్రతి రోజూ ప్రత్యక్షంగా, పరోక్షంగా సమీక్షలు జరుపుతుందని ఆయన తెలిపారు. కమిటీ కన్వీనర్ గా రణదీప్ సుర్జేవాలా వ్యవహరిస్తారని, రాహుల్ గాంధీ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. మాజీ మంత్రులు పీ చిదంబరం, మనీశ్ తివారీ, జైరాం రమేశ్, పార్టీ నేతలు ప్రవీణ్ చక్రవర్తి, గౌరవ్ వల్లభ్, సుప్రియా శ్రీనాటే, రోహన్ గుప్తాలు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారని తెలిపారు.

Related posts